జీవీఎల్ ఒక ఆంధ్రా బ్రహ్మానందం: టీడీపీ నేత బుద్ధా వెంకన్న

  • ఏపీ అభివృద్ధిని జీవీఎల్ అడ్డుకోవడం తగదు
  • మోదీకి ఊడిగం చేయడం జీవీఎల్ నైజం
  • బాబుపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదం
ఏపీ ప్రభుత్వంపై బీజేపీ పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీవీఎల్ ఒక  ఆంధ్రా బ్రహ్మానందం అని, ప్రధాని నరేంద్ర మోదీకి ఊడిగం చేయడం జీవీఎల్ నైజమని, చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని, రాజ్యసభ సభ్యుడంటే జీవీఎల్ గొప్ప అనుకుంటున్నాడని,100 మంది రాజ్యసభ సభ్యులను తయారు చేసిన ఘనుడు చంద్రబాబు అని కొనియాడారు.

ఏపీ అభివృద్ధిని జీవీఎల్ అడ్డుకోవడం తగదని, బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజులకు పదవులే ముఖ్యం తప్ప రాష్ట్ర అభివృద్ధి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కన్నా అవినీతిపై జీవీఎల్ సీబీఐ విచారణ ఎందుకు కోరరని ప్రశ్నించారు. మోదీ తాతగారి సొమ్ము ఏమైనా ఏపీకి ఇస్తున్నారా? అని ప్రశ్నించిన బుద్ధా వెంకన్న, పోస్టర్లు వేసి మరీ, మిమ్మల్ని ద్రోహులు అని ప్రజలకు చాటి చెప్పాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
gvl
Brahmanandam

More Telugu News